ముక్కోటి ఏకాదశి, లేదా వైకుంఠ ఏకాదశిని ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. సాధారణ ఏకాదశులు చాంద్రమానం ఆధారంగా ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశి సౌరమానం ప్రకారం ప్రత్యేకంగా జరుపుకోవడం విశేషం. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాసంలో ఈ పవిత్రదినం భక్తుల జీవనానికి మహత్తర అనుగ్రహాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ రోజు, ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువును దర్శిస్తారని విశ్వాసం ఉంది. ఈ సంప్రదాయం ఆలయాల్లో కూడా కొనసాగుతుంది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక రత్న మందిరాలు నిర్మించి భక్తులు స్వామిని దర్శిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం పొందుతారని, జన్మ పునీతమవుతుందని భక్తులు నమ్ముతారు.
Mukkoti Ekadasi Importance : ముక్కోటి ఏకాదశిని సౌరమానం ప్రకారం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?


