Site icon Bhakthi TV

శ్రీరంగనాథుడి ఆలయ విశేషాలేంటంటే..

కర్ణాటక జిల్లాలోని మాండ్య పట్టణంలో గల రంగనాథ స్వామి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ స్వయంగా ఇక్కడ శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని తయారు చేసి పూజించమని శ్రీరాముడి పూర్వీకులకు ఇచ్చాడట. శ్రీరాముని ద్వారా ఈ విగ్రహం శ్రీరంగపట్నానికి చేరిందని కూడా చెబుతారు. శ్రీ రంగపట్నం రంగనాథుని దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఐదంతస్థుల రాజగోపురాన్ని దాటి లోపలకు ప్రవేశిస్తారు. అక్కడ గర్భగుడిలో ఆదిశేషునిపై శయనిస్తూ దేవేరి రంగనాయకి సమేత రంగనాథుడు దర్శనమిస్తాడు.

అలాగే ఈ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, ఆళ్వార్లు, గరుడ, హనుమంతుడు, నరసింహుడు తదితర దేవతతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తరువాతి నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ అన్ని సేవలూ శ్రీవైష్ణవ ఆగమ పద్దతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇక ధనుర్మాసం వచ్చిందంటే ఆ నెలంతా తిరుప్పావై ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం… భోగి పండుగ రోజు శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే బెంగుళూరు నుంచి రవాణా సదుపాయాలుంటాయి.

Share this post with your friends
Exit mobile version