
ఇతర సంక్రాంతి పండుగలాగే.. ఈ రోజున పూర్వీకులకు నివాళులర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని నిర్వహించడానికి చాలా మంది ప్రజలు నది ఒడ్డున ఉన్న దేవాలయాలను సందర్శిస్తారు. మిథున్ సంక్రాంతికి ఏం తీసుకుంటారో తెలుసుకుందాం. పోడా – పితా అనేది ఒడిశాలో ముఖ్యంగా రాజా పర్బా సందర్భంగా చేసుకుంటారు.మిథున సంక్రాంతిపై తయారు చేసిన రుచికరమైన ఆహార పదార్థం. దీనిని బెల్లం, కొబ్బరి, కర్పూరం, మొలాసిస్, వెన్న, బియ్యం పిండితో తయారు చేస్తారు. ఈ రోజు ముఖ్యంగా బియ్యంతో తయారు చేసిన పిండి వంటలను స్వీకరిస్తారు.
ఈ రోజున ప్రసిద్ధ జానపద పాట అయిన రాజా గీతను పాడతారు. వర్షాన్ని స్వాగతించడానికి పురుషులు, మహిళలు భూమిపై చెప్పులు లేకుండా నడుస్తారు. అలాగే సరదాగా.. పాటలు, డ్యాన్స్తో గడుపుతారు. హిందువులు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మిథున సంక్రాంతికి ఉపవాసం ఉండాలని చెబుతారు. వారి జీవితంలో రాబోయే నెలలు మరింత ప్రశాంతంగా.. సంతోషంగా ఉండేలా చూస్తారు. ఒడిశాలోని జగన్నాథ్ ఆలయం అలంకరించబడి భగవంతుడు, అతని భార్య భూదేవి (దేవత భూమి)ని పూజించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.
