
దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం రెండూ మనుషుల్లో చిన్ననాటి నుంచే ఉంటాయి. అయితే భయం చుట్టూ అల్లుకున్న కథలకు ఆధారాలు అయితే ఉండవు. కాకన్మఠ్ ఆలయం మిస్టరీ కూడా అలాంటిదేనని చెప్పాలి. ఎన్నో మిస్టరీలకు నిలయమైన ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. కకాన్మఠ్ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. మధ్యప్రదేశ్లోని మురైనాలో ఈ ఆలయం ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడమిది. సిమెంట్ కానీ.. సున్నం కానీ వాడకుండా దీనిని నిర్మించారు.
అయినా సరే ఈ ఆలయం కొన్ని శతాబ్దాల పాటు ఈ కట్టడం చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్ మెటీరియల్ వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ ఆలయాన్ని దెయ్యాలు 11వ శతాబ్దంలో నిర్మించారట. ఈ ఆలయం 115 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయని చెబుతారు కాబట్టి ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి కానీ.. హోమ్ గార్డ్స్ కానీ ఉండరు. గుడికి కాస్త దూరంలో ఉండి రాత్రి సమయంలో గుడి వైపు ఎవరూ వెళ్లకుండా కాపలా కాస్తుంటారు.
