Site icon Bhakthi TV

యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం ఏంటంటే..

తిరుమల ఏడు కొండల్లో ఐదు కొండలు ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు. పరమశాంతి కలుగుతుంది. అది ఆరవ కొండకు వేంకటాద్రి అని పేరు.

తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది. ఇది పరమాత్మ చక్రం. ఇంక అక్కడ సాధకుడు లేడు. నారాయణుడే ఉన్నాడు. సాధకుడు తనే పరమాత్మ అవుతాడు. నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు.
అందుకే ఏడవ కొండకి.. నారాయణాద్రి అని పేరు.

యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం ఏంటంటే..

మనం ఎక్కేటప్పుడు మెట్లని గమనిస్తే అవన్నీ ఇలా 8,16,24,32..లో ఉంటాయి. ఇది మనల్ని అష్టాంగ యోగం చెయ్యమని చెపుతున్నట్లు అర్థమట. అష్టాంగయోగం అంటే.. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి. భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో స్వామి వారు మనందరికి కళ్ళముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం, తెరవకపోతే నరులం.

Share this post with your friends
Exit mobile version