Site icon Bhakthi TV

తిరుమలలోని ఇతర మండపాల ప్రాముఖ్యత ఏంటంటే..

తిరుమలలోని పలు మండపాల గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇక మిగిలిన మండపాలలో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

అద్దాల మండపం / అయిన మహల్

శ్రీ కృష్ణ దేవరాయ మండపానికి ఉత్తరాన ఈ మండపం ఉంటుంది. 36 స్తంభాలు కలిగిన ఈ మండపంలో శ్రీ మలయప్ప స్వామికి ప్రతిరోజూ డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ మండపం లోపల లోపల అద్దాలు అమర్చబడి ఉంటాయి. 831 ADలోనే ఈ మండపం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.

కళ్యాణ మండపం..

27 స్తంభాలతో 80×30 అడుగుల మండపాన్ని శ్రీవారి ఆలయానికి దక్షిణంగా 1586ADలో నిర్మించారు. ఈ మండపం కేవలం నాలుగు చిన్న స్తంభాలతో నిర్మించారు. పూర్వం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి నిత్య కల్యాణంలో ఈ మండపంలోనే నిర్వహించేవారు.

స్నపన మండపం

బంగారు వాకిలి లోపల ఉండే చతురస్రాకారపు మండపాన్నే స్నపన మండపం అంటారు. దీనిని తిరువిలన్ కోయిల్ అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ మండపంలో అభిషేకాలు జరిగేవి.

శయన మండపం

రాములవారి మేడ ముందు ఈ మంటపం ఉంది. ప్రతి రాత్రి ఇక్కడ భోగ శ్రీనివాస మూర్తికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. అన్నమాచార్య వంశస్థుడు అన్నమయ్య లాలి పాడాడు. సుప్రభాతం తర్వాత తోమాల సేవలో దివ్య ప్రబంధ గానం చేస్తారు. ఇక్కడ సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఆర్జిత సేవా భక్తులు ఇక్కడ కూర్చొని ప్రధాన దేవతకు చేసే వివిధ సేవలను వీక్షిస్తారు.

అంకురార్పణ మండపం

వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు, ఈ అంకురార్పణ మండపంలో బీజవాపనం అనే ఆచారాన్ని నిర్వహిస్తారు.

ఇతర మండపములు

తిరుమల ఆలయంలో, ఇంకా చాలా మండపాలున్నాయి. ఇక్కడ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయా మండపాల్లో గొల్ల మండపం, పారువేట మండపం, ఆస్థాన మండపం, సహస్ర దీపాలంకార సేవా మండపం, వసంతోత్సవ మండపం, వాహన మండపం, నాదనీరాజన మండపం ఉన్నాయి.

Share this post with your friends
Exit mobile version