Site icon Bhakthi TV

దుర్గమ్మ ఆ ప్రాంతంలో ఒకరోజు బస చేసిందట..

దసరా పండుగను ఉత్తర బెంగాల్‌లోని బోధన్ గ్రామాల్లో ఏకాదశి రోజున జరుపుకుంటామని తెలుసుకున్నాం. అక్కడ దుర్గమ్మను భండారీ దేవిగా పూజిస్తాం. అసలు దీనికి కారణం ఒకటుంది. ఉత్తర బెంగాల్‌లోని విస్తారమైన అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు అమ్మవారిని ‘బందుర్గా’గా పూజిస్తారు. ఇక ఉత్తర బెంగాల్ అడవుల్లో కూడా ఏకాదశి నాడు పండుగ ప్రారంభమై దుర్గాదేవి బలి తర్వాత పండుగ ముగుస్తుంది. రాజవంశీ సమాజంలో భండారీ దేవిని పూజించడం వెనుక ఓ కథ ఉంది.

అసుర సంహారం అనంతరం దుర్గమ్మ తన తండ్రి నివాసం నుంచి కైలాసానికి ఈ అటవీ గ్రామాల మీదుగా వెళుతోందట. అప్పుడు ఆ గ్రామంలో తీవ్ర క్షామం ఉందట. దీంతో ఆ ప్రాంత రైతులు దుర్గమ్మను ఒక రాత్రి తమ గ్రామంలో ఉండాలని వేడుకున్నారట. రైతుల కోరిక మేరకు ఆ ప్రాంతంలో అమ్మవారు ఒకరోజు బస చేసిందట. రాత్రంతా గ్రామస్తుల పూజ అందుకుని ఏకాదశి నాడు తిరిగి కైలాసానికి వెళ్లిందట. ఆ తరువాత ఆ ప్రాంతమంతా దుర్భిక్షం మొత్తం తొలగిపోయి అక్కడి ప్రజలు సంపదలతో సంతోషంగా ఉన్నారట. వారి గోదాములు ధాన్యంతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ దుర్గాదేవిని భండారీ రూపంలో పూజిస్తారు. మరో విశేషం ఏంటంటే భక్తులు పావురాలకు ధాన్యం సమర్పిస్తారు. లాగోవా తూర్పు భోలా, అలీపుర్‌దువార్ పట్టణంలోని దబ్రి గ్రామంలో 130 ఏళ్లుగా భండారీ పూజ నిర్వహిస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version