
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని బవాడి అనే గ్రామంలో ఓ గణేశుడి ఆలయం ఉందని తెలుసుకున్నాం కదా. ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటే చాలు.. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం. ఈ ఆలయానికి పెళ్లికాని యువతీ యువకులు, వారి తల్లిదండ్రులతో వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 400 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ మెట్ల బావి తవ్వుతుండగా వినాయకుడి విగ్రహం బయల్పడింది. ఆ విగ్రహాన్ని ముందుగా బావి నుంచి బయటకు తీసి వేదికపై ఉంచి పూజలు నిర్వహించేవారు. అనంతర కాలంలో ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.
వివాహ అడ్డంకులు ఉన్నవారు ఈ వినాయకుడిని సందర్శించి పూజలు చేయడం వలన విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ముఖ్యంగా బుధవారం స్వామివారికి సూర్యచంద్రులను సమర్పించాలి. అనంతరం పరిక్రమ చేస్తే వివాహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయట. అలాగే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ ఆలయంలో శివుడు కూడా ఉంటాడు. ముక్తేశ్వర మహాదేవుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు. పైగా ఇక్కడ పూజలు నిర్వహిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సైతం గట్టెక్కుతారట. నిత్యం ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
