Site icon Bhakthi TV

శ్రీకృష్ణుడి ఉడిపితో మధ్వాచార్యులకు ఉన్న సంబంధం ఏంటి?

ఇవాళ అన్నదా ఏకాదశి. కాబట్టి ఈ రోజున కృష్ణ లీలలు స్మరించుకుందాం. ఈ క్రమంలోనే స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన ”ఉడిపి శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం” శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడిపి. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది.

ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాతః సంధ్యాధికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతుంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతః కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపథ్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ఏం జరుగుతుందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version