
శ్రీ వేంకటేశ్వరస్వామిని గురించిన ప్రసక్తి ఋగ్వేదంలో ఉన్నదని ఈ క్రింది మంత్రాన్ని ప్రమాణంగా ఉదాహరిస్తారు.
అరాయి కాణే వికటే గిరింగచ్ఛ సదాన్వే శిరింబిరస్య…
(ఋక్సంహిత 10-155-1)
దీని భావం ఏంటంటే.. “ఓ నిర్దనుడా ! (పరలోకజ్ఞానంలేని వాడా!) అంధుడా! (పరమార్థజ్ఞానం లేనివాడా!) క్లిష్టపరిస్థితి సంభవించినపుడు, దానవులు ఆక్రమించినప్పుడు (లౌకికవిషయాలు అననుకూలంగా మారినప్పుడు) శ్రీనివాసునికొండకు పొమ్ము” నిర్ధనులు, కష్టదశలో ఉన్నవారు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆపదమ్రొక్కులవానిగా భావించి సేవించడం నేటికీ కలదు. పై మంత్రానికి సాయణ భాష్యంలో ఈ అర్ధం చెప్పబడలేదు. అయినా అతిపురాతన కాలం నుంచి ఈ అర్థాన్ని కొందరు అంగీకరించినారని భవిష్యోత్తర పురాణం నుండి తెలుస్తున్నది. ఆ పురాణంలో ఈ వేటమంత్రానికి వేంకటాద్రి పరంగా అర్థం అంగీ కరింపబడింది.
ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వేంకటాచలే, అరాయికాణే వికటే గిరిం గచ్ఛేతి తం విదుః ఏవం వేదమయ స్సాక్షాత్ గిరీంద్రః పన్నగాచలః ఛన్న వల్మీక దేహాడ్యో వైకుంఠాదధికోహ్యభూత్.
