గరుడపురాణం చెబుతున్న స్వర్గ నరక రహస్యం మనల్ని ఆలోచనలో పడేస్తుంది. మనం చేసిన ప్రతి కర్మకు ఒక దారి, ఒక గమ్యం తప్పక ఉంటుందని ఈ పురాణం స్పష్టం చేస్తుంది. పాపాత్ములు నరకంలో ఒకేలా శిక్షలు అనుభవించరు, చేసిన పాపం ఎంత లోతుగా ఉంటే శిక్ష కూడా అంత తీవ్రమవుతుంది. అలాగే పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్లినా అందరికీ ఒకే ఆనందం లభించదు, చేసిన సత్కర్మల ప్రకారం వేర్వేరు లోకాలు లభిస్తాయి. భూలోకం నుంచి మొదలై భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం అంటూ జ్ఞానం, తపస్సు పెరిగే కొద్దీ లోకాలు మారతాయి. తపోలోకం, సత్యలోకం చేరుకోవాలంటే సంపూర్ణ త్యాగం, బ్రహ్మజ్ఞానం అవసరం. విష్ణుభక్తులకు వైకుంఠం, కృష్ణభక్తులకు గోలోకం, శివభక్తులకు కైలాసం లభిస్తాయి. గరుడపురాణం ఒకటే బోధిస్తుంది… స్వర్గం, నరకం మనం సృష్టించుకున్న మార్గాలే. జీవితం ఒక పరీక్ష, కర్మే తుది తీర్పు.

