
తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదిలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
పోటెత్తిన భక్తులు..
ఈ రోజు వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం జరిగింది. మొదట ఎస్ఎస్డీ టోకెన్స్ జారీ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీస్, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై క్యూ లైన్ లలో పరిస్థితిని అదుపు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.
