Site icon Bhakthi TV

Scientific Reasons Why We Should Visit to Temple : ధనుర్మాసంలో ఉలగలంద పెరుమాళ్ ఆలయ దర్శనం ఎందుకు చేయాలో తెలుసా?

ధనుర్మాసంలో ఉలగలంద పెరుమాళ్ ఆలయ దర్శనం ఎందుకు చేయాలో తెలుసా..! #dhanurmasam #perumal #perumaltemple

తమిళనాడు కాంచీపురం సమీపంలోని తిరుకోవిలూర్‌లో ఉన్న ఉలగలంద పెరుమాళ్ ఆలయం, పంచ కృష్ణ క్షేత్రాలలో మొదటిది మరియు 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం భూమండలాన్ని కొలిచిన త్రివిక్రముని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు అంకితమై ఉంది. పల్లవులు నిర్మించి, చోళులు, విజయనగర రాజులు విస్తరించిన ఈ ఆలయం తిరుమంగై ఆళ్వార్ పాశురాల ద్వారా గొప్ప కీర్తి పొందింది. మూల విగ్రహం ఉలగలంద పెరుమాళ్ ఎడమ చేతిని ఎత్తి ప్రపంచమంతా కొలిచినవాడు అని చూపిస్తూ ఉంటాడు. ఇతర వైష్ణవ ఆలయాల్లో ఎక్కడా ఇలాంటి రూపంతో స్వామివారు దర్శనమివ్వలేదు. అంతేకాదు, ఇక్కడ స్వామివారు మూడు రూపాల్లో దర్శనం ఇవ్వడం కూడా విశేషమే. ఇక ధనుర్మాసంలో ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అండాళ్ ఆళ్వార్ తిరుప్పావై 30 పాశురాలను గర్భగుడి ముందు పారాయణం చేస్తారు. ధనుర్మాసం ముగింపు రోజున ఉత్సవాల పరంపరలో నీరాట్టం కార్యక్రమం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఉదయం “సొర్గ వాసల్” తెరుచుకుంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. ఈ పుణ్యక్షేత్ర దర్శనంతో భక్తులకు మోక్షఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Scientific Reasons Why We Should Visit to Temple
Share this post with your friends
Exit mobile version