లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 10వ తేదీ అయోధ్యకాండ 12వ విడత అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు వైభవంగా జరుగనుంది. ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం, టీటీడీ వేదపండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయోధ్యకాండలోని 45 నుండి 49 సర్గలలోని 141 శ్లోకాలు, పారాయణం చేస్తారు. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం పండితులు శ్రీ రామానుజా చార్యులు, శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేస్తారు.
2024-07-07